Sunday, April 28, 2024

మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. ఎక్సైజ్‌, పోలీసు రవాణా విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీసు నియామక మండలి ద్వారా మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎక్సైజ్‌, పోలీసు రవాణా విభాగంలో కలిపి మొత్తం 677 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పోలీసు నియామక మండలి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 614 పోస్టులు ఎక్సైజ్‌ శాఖలో, 63 పోస్టులు పోలీసు శాఖకు చెందినవి ఉన్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లుగానే మే 2 వ తేదీ నుంచి 20 వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పోలీసు శాఖలో పాటు ఎస్‌పీఎఫ్‌, జైళ్ళ శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement