Monday, April 29, 2024

గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాల్లో 6,7,8వ తరగతులలో ప్రవేశానికి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ విద్యాలయ సంస్థ నోటిపికేషన్‌ విడుదల చేసింది. బీసీ బాల, బాలిక పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి ఆరు, ఏడు, ఎనిమిదవ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియాలో ఖాళీ సీట్లలో భర్తీ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ , ఇబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులను నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష నిమిత్తం రూ.100 రుసుంను ఆన్‌లైన్‌లో చెల్లించాలని ఆయన కోరారు.

ఈనెల 16వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ లోగా దర ఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశపరీక్ష జూన్‌ 16న నిర్వహిస్తామని, హాల్‌టిక్కెట్లను జూన్‌ 10 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు041-23322377, 23328266 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement