Monday, April 29, 2024

Nomination Filled – బుల్లెట్ పై వ‌చ్చి నామినేష‌న్ వేసిన రాజా సింగ్

హైద‌రాబాద్ – గోషామహల్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎలాంటి ఆర్భాటం లేకుండా.. బుల్లెట్‌పై వచ్చి అబిడ్స్‌లోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. రాజాసింగ్‌ వెంట పెద్ద ఎత్తున వచ్చిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో.. నలుగురితో కలిసి అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లారు. నలుగురితో కలిసి అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలుకు ముందు రాజాసింగ్ మాట్లాడుతూ… గోషామహల్‌లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఇంకా నిర్ణయించలేదని ఎద్దేవా చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని ప్రతిపక్షాలు చూసినప్పటికీ, గోషామహల్ ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. ఇక్కడకు వచ్చిన వారంతా తమ వానరా సేన అన్నారు. మూడోసారి కూడా తనే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి గెలిచి బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement