Thursday, May 2, 2024

ప్రశాంతంగా ఎన్ఎమ్ఎమ్ఏస్ పరీక్ష

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడులో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నాలగేళ్ల పాటు చదువుకు అయ్యే ఖర్చు పొందేలా విద్యార్థులలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఉపకారవేతనం అందించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయము 9:30 నుండి 12.30 వరకు జరిగింది.  ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి బి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 175 విద్యార్థులకు గాను 162 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement