Thursday, May 16, 2024

NZB: వెంకన్నస్వామి మొక్కు తీర్చుకున్న చిన్నారి

నిజామాబాద్ సిటీ,జనవరి 6(ప్రభ న్యూస్): నిజామాబాద్ అర్బన్ లో ప్రజా సేవకుడిగా ట్రస్టును ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తున్న ధన్‌పాల్ సూర్యనారాయణ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన నందిక అనే చిన్నారి అర్బన్ ఎమ్మెల్యేగా సూర్యనారాయణ విజయం సాధిస్తే తిరుమలలోని వెంకన్న స్వామి దర్శనానికి కాలినడకన వస్తానని మొక్కుకుంది.

శనివారం తిరుమలలో నందిక కాలినడకన స్వామివారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్‌పాల్ సూర్యనారాయణ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement