Tuesday, May 7, 2024

MDK: గుండెపోటుతో తల్లీ, కొడుకు మృతి..

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా హవేలి ఘణపూర్ మండలం కుచన్ పల్లి గ్రామంలో తల్లి, కొడుకు గుండెనొప్పితో మృతిచెందారు.. కుచన్ పల్లి గ్రామానికి చెందిన వీరప్ప గారి నర్సా గౌడ్ (39) గుండెపోటుతో మృతిచెందాడు. ఇతని వృత్తి ఆటో డ్రైవర్. ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఈ ఉదయం నాలుగు గంటలకు ఛాతిలో నొప్పి వస్తుందని తన భార్యతో చెప్పగా.. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

కొడుకు మరణించిన విషయాన్ని తెలుసుకొని బాధను తట్టుకోలేక ఆమెకు గుండెపోటు వచ్చి తల్లి కూడా మృతిచెందింది. మృతుడి తల్లి బీరప్ప లక్ష్మి (62). నర్సా గౌడ్ భార్య లత, కూతురు ప్రసన్న 9 తరగతి చదువుతోంది. కొడుకు కార్తీక్ గౌడ్ ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లీ, కొడుకు ఓకే రోజు గుండెపోటుతో చనిపోవడంతో కుచన్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement