Monday, May 6, 2024

ఎంపి అర‌వింద్ నోరు విప్పితే అబ‌ద్దాలు, బూతులు – ప్ర‌శాంత్ రెడ్డి

వేల్పూర్ ఫిబ్రవరి 25 (ప్రభ న్యూస్ ) – ఎంపి అరవింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతరు తప్పా ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. తాను బాల్కొండ లో 10 వేల మందికి 40కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిసహయనిది ద్వారా అందించాననీ,దమ్ముంటే ప్రధాన మంత్రి సహాయ నిధి కింద నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఎంపి అరవింద్ కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చాడో,కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏమీ అభివృద్ది చేశాడో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అర్వింద్,ఇపుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గులేకుండా చెప్తున్నాడని దుయ్యబట్టారు.

తాము అధికారంలోకి వస్తే అన్ని ఇస్త్చామని చెప్తున్న ఎంపి ముందుగా తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలని డిమాండ్ చేశారు. 18 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న బిజెపి అక్కడ ప్రజలకు ఇస్తున్న పెన్షన్ ఎంతో అందరికీ తెలుసన్నారు. ప్రజలంతా మెల్లమెల్లగా ఆలోచన చేస్తున్నారు కాబట్టే బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు.ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కేవలం బాల్కొండ నియోజక వర్గంలో 100 కోట్ల తో రోడ్లు నిర్మించానని తెలిపారు. వందల కోట్లతో బి.టి రోడ్లు, మెయిన్ రోడ్లు,చెక్ డ్యాంలు,హెల్త్ సబ్ సెంటర్,గ్రామ పంచాయతీ భవనాలు,కుల సంఘాల భవనాలు,50పైగా గుడులు నిర్మించుకున్నమని తెలిపారు. ఎండ కాలంలో కూడా నవాబ్ లిఫ్ట్,చౌట్పల్లి హన్మంతు రెడ్డి లిఫ్ట్ లను నడిపిస్తూ చెరువులను నింపుకుంటున్నమని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక జరిగిన అభివృద్ది, మార్పు ప్రజలు గుర్తించాలని కోరారు. కొందరు అక్కడక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తారని అట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభివృద్దిపై గ్రామాల్లో చర్చ జరగాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement