Sunday, April 28, 2024

NZB: ఏటీఎంలో చోరికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్..

నిజామాబాద్, మార్చి 5 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఏటీఎం సెంటర్లలో అమాయక ప్రజలను మోసం చేసి, వారి ఏటీఎం నుండి డబ్బులను దండుకున్న గద్దమిది రమేష్ @బగ్గిలి రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ SHO విజయ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కామారెడ్డి జిల్లా, భిక్కనుర్ మండలం,జంగం పల్లి గ్రామానికి చెందిన గడ్డమిది రమేష్ ఇటీవల నగరంలోని వన్ టౌన్ పరిధిలోని మూడు ఏటీఎం సెంటర్లో ఈ చోరికి పాల్పడినట్లు వెల్లడించారు.

డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వచ్చిన అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, వారి ఏటీఎం ను దొంగలించి, వారి అకౌంట్ లో నుండి డబ్బులను దొంగలించే వాడని తెలిపారు. మంగళవారం ఉదయం వన్ టౌన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. మూడు కేసుల్లో మొత్తం రూ.30వేలు రికవరీ చేసి, నిందితుడిని కోర్లులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు విజయ్ బాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement