Thursday, May 2, 2024

NZB | హ‌టాత్తుగా గుండెపోటు.. బ‌స్సు సీటులోనే కుప్ప‌కూలిన ప్ర‌యాణికుడు

నిజామాబాద్, (ప్రభ న్యూస్): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో చ‌నిపోయిన ఘ‌ట‌న ఇవ్వాల (శుక్ర‌వారం) నిజ‌మాబాద్ సిటీలో జ‌రిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన బొమ్మన కిరణ్ పని నిమిత్తం నిజామా బాద్ వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామానికి బయలుదేరేందుకు నగరంలో హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అనంతరం కంటేశ్వర్ బైపాస్ వద్దకు రాగానే కిరణ్ తాను కూర్చున్న సీటులోనే గుండెపోటు వచ్చి కుప్పకూలి పడిపోయాడు.

దీంతో ఆర్టీసి కండక్టర్ 100 కు సమాచారం అందిం చగా ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు మృత దేహాన్ని పంచానామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. కిరణ్ జేబులో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కోరుట్ల లోని నక్కల గుట్టకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు రూరల్ టౌన్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పుతామని అయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement