Saturday, May 4, 2024

తండ్రి, బాబాయ్ ని పారతో హతమార్చిన కొడుకు

భూ తగాదాల విషయంలో మాటామాటా పెరగడంతో కన్నతండ్రితో పాటు బాబాయ్ ను పారతో దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని మోపాల్ మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల అబ్బయ్య, నడిపి సాయి అన్నదమ్ములు. స్థలం విషయంలో కుటుంబంలో గొడవ రావడంతో అబ్బయ్య కుమారుడు సతీష్ సమీపంలోని గడ్డపారతో తండ్రితో పాటు చిన్నాన్న నడిపి సాయిలపై కిరాతకంగా దాడి చేశాడు. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో మోపాల్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ జంట హత్యల విషయం తెలుసుకోగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement