Sunday, April 28, 2024

NZB | నిజామాబాద్‌లో తనిఖీలు.. ఏడు లక్షల పట్టివేత

నిజామాబాద్ (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.7 లక్షల నగదుని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘానా వార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి, నిజామాబాద్ పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో నాలుగో పట్టణ ఎస్సై సంజీవ్, ఏఎస్ఐ రామ కృష్ణ వారి సిబ్బంది రమేష్, అనిల్, మనోజ్ లు ఎల్లమ్మ గుట్ట వద్ద ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళుతున్న రూ.7 లక్షల ఏడు వేల రూపాయలను మోర దీపక్ అనే వ్యక్తి వద్ద నుండి స్వాధినపరుచుకున్నారు.

ఈ సందర్భంగా టౌన్ సీఐ నరహరి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ అక్రమంగా డబ్బులు తరలించవద్దని పట్టణ ప్రజలకు సూచించారు. ఈ రూ.7 లక్షల ఏడు వేల రూపాయలు నిజామాబాద్ ట్రెజరీలో జమ చేసి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించినట్టు పట్టణ సీఐ నరహరి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement