Thursday, May 2, 2024

కామారెడ్డిలో మంకీ ఫాక్స్ కలకలం.. కువైట్ నుంచి వచ్చిన వ్య‌క్తిలో గుర్తింపు

కామారెడ్డి, (ప్రభన్యూస్) : కామారెడ్డి జిల్లాలో మంకీ ఫాక్స్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన 35 సంవత్సరాల ఓ వ్యక్తి ఈ లక్షణాలతో బాధపడుతూ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. కువైట్ నుంచి వచ్చిన అతనికి డాక్ట‌ర్లు పరీక్షలు నిర్వహించారు. మంకీ ఫాక్స్ లక్షణాలున్నట్లు ప్రాథమిక ప‌రీక్ష‌లో తేలడంతో అతడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కు చెందిన సదరు వ్యక్తి ఈ నెల 6 న కువైట్ నుంచి వచ్చాడు. ఈ నెల 20 నుంచి జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. 23న మంకీప్యాక్స్ లక్షణాలు కనిపించాయి. దాంతో అతను డాక్ట‌ర్ల‌ను సంప్రదించగా ఆదివారం మంకీ ఫాక్స్ గా అనుమానిస్తూ హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టుగా సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement