Tuesday, April 16, 2024

నిజామాబాద్‌లో నీలకంఠేశ్వరాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిజామాబాద్‌ నగంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్‌ కొండూరులో జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి లోహమయ శిలామయ విగ్రహ ప్రతిష్టాపన ఆలయ పున ప్రారంభోత్సవ వేడుక తొలి ఆహ్వాన పత్రికను నీలకంఠేశ్వరాలయ స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ ఇంటి ఇలవేల్పు అయిన సీహెచ్‌ కొండూరులోగల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునప్రారంభం వచ్చే నెల 4 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement