Tuesday, April 30, 2024

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలి… గంప గోవర్ధన్

బిక్కనూర్, ఆగస్టు 4, ప్రభా న్యూస్… కామారెడ్డి ప్రాంతానికి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రైతులు బోరుబావులు, చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తే రైతులకు పుష్కలంగా పంటలు పండే అవకాశం ఉంటుందని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన స్పీకర్ ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement