నాగిరెడ్డిపేట్: మండలంలోని జలార్పూర్ గ్రామానికి చెందిన బేగరి పెద్ద లక్ష్మయ్య, చిత్రమ్మ అనే భార్యాభర్తలు ఇద్దరు శనివారం తల్లిగారి గ్రామం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రక్కన హుమ్నాబాద్ కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నిజాంపేట్ దగ్గర లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.వారికి ఆరుగురు కుమారులు ఉన్నారని, వారు అందరూ హైదరాబాద్ లో నివాసముంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భార్య భర్తలు ఇద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామ ప్రజలందరూ కన్నీరుమున్నీరయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital