Sunday, April 28, 2024

NZB : ప్ర‌ధానికి ప్ర‌తి ఒక్క‌రు అండ‌గా ఉండాలి… ఎంపీ అర‌వింద్‌..

నిజామాబాద్, ఏప్రిల్ 7 (ప్రభ న్యూస్): ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మార్కండేయ చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్ల‌ర్పించారు.

- Advertisement -

అనంత‌రం ఎంపీ అర‌వింద్ మాట్లాడుతూ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్య మని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి ఎందు కు కాలేదో పద్మశాలీలు ఆలోచించుకోవాలని అన్నారు. గత మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా బిజెపి కార్పొ రేటర్లు భారీ మెజార్టీతో విజ యం సాధించారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్పొరేట ర్ ఎనికల్లో పద్మశాలీలకు నలుగురికి బిజెపి అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఎంపీ నిధుల నుంచి 1.8 కోట్లు పద్మ శాలీల అభ్యున్నతకి కేటాయించానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement