Saturday, May 4, 2024

NZB: బీజేపీ పార్టీ బలోపేతమే ధ్యేయంగా కృషి చేస్తా.. దినేష్ కులాచారి

నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలోని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ బీజేపీ పార్టీ బలోపేతమే ధ్యేయంగా కృషి చేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తెలిపారు. ఎప్పటి కప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ బలో పేతానికికృషి చేస్తానని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో జిల్లా అధ్యక్షులు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులా చారి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి పోరాటం చేస్తూ ఒక జడ్పీటీసీగా ఎదిగిన త‌న‌ను బీజేపీ పార్టీ అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడమే కాకుండా నిజామాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించిన అధిష్టానానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి అమిత్ షాక్, జాతీయ నాయకులు జెపి నడ్డా ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తర్వాత తనకోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి అండగా ఉండడం కోసం పార్టీకి సేవలందించడానికి నిర్ణయం తీసుకున్నాన ని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీరో బడ్జెట్ తో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయగా 50 వేల మెజార్టీ రావడానికి ప్రధాన కారణం కార్యకర్తల త్యాగమేనని గుర్తు చేశారు. ఈనెల 25న బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా పదాధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు ,నాయకులు అందరూ హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement