Saturday, May 18, 2024

సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది..ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)19 కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయడం ఎంతో సంతృ ప్తినిస్తుందని.. మాట ఇచ్చి నిలబెట్టుకోవడంలో ఆ సంతో షమే వేరని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని 8వ డివిజన్ లో వర్షానికి ఇల్లు కోల్పోయి నష్టపోయిన కుటుంబానికి అర్బన్ ఎమ్మెల్యే ధనాపాల్ సూర్యనారాయణ గుప్త అండగా నిలిచారు. ధన్పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తచా రిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటిని నిర్మించి బాధితులకు అంద జేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన ఇందూ ర్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.

. ట్రస్ట్ ద్వారా ఇంటిని నిర్మించి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అర్హు లైన ప్రతి ఒక్కరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి శాయశక్తుల కృషి చేస్తానని భరోసా కల్పించారు. మీ కళ్ళలో. ఆనందం, మీ ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే నా కోరిక అని పేర్కొన్నారు.

ఇక నూతన ఇల్లు పొందిన బాధితుల ఆనందంకు హద్దులు లేకుండాపోయాయి. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన నాయకులను చూశామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నాయకున్ని మొదటి సారి చూస్తున్నా మన్నారు. ప్రభుత్వ పథకాలు వచ్చే వరకు వేచి చూడకుండా స్వంత డబ్బులతో మాకు నీడను కల్పించిన సూరన్నను గుండెల్లో పెట్టి ఆదరిస్తామని హర్షం వ్యక్తం చేశారు.

ధన్పాల్ రాజకీయాల్లోకి రాకముందు ఎంతటి ఆప్యాయతతో మాకు పలకరించారో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అంతే ఆప్యాయతతో మాకు ఆదరించి ఇచ్చిన హామి నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు

.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షలు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మఠం పవన్ కుమార్,అంబదాస్,రవి డివిజన్ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement