Friday, May 17, 2024

TS: వర్నిలో కార్డెన్ సెర్చ్.. 56వాహనాలు స్వాధీనం

నిజామాబాద్ కమిషనరేట్ సి.పి.ఆదేశాల మేరకు ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒడ్డేపల్లి గ్రామంలో బుధవారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలోని సరైన ధ్రువపత్రాలు లేని 56 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ స్థానిక ప్రజలతో మట్లాడుతూ… ప్రజల రక్షణ గురించి ప్రజల్లో భద్రతాభావం కల్పించడం గురించి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రుర్ సిఐ జయేష్ రెడ్డి, బోధన్ రూరల్ సీ.ఐ శ్రీనివాస్ రాజ్, ఎస్.ఐ లు కృష్ణ కుమార్, నీరేష్, సందీప్, విక్రమ్, పీటర్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement