Monday, May 6, 2024

AP : బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు

బాపట్ల : పాఠశాల బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు వద్ద చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌ గుర్రాల ఏడుకొండలు(53) మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలాడు.

ఆ సమయంలో పాఠశాల బస్సు రోడ్డు మధ్యలో ఆగింది. స్థానికులు గమనించి డ్రైవర్‌ను కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. అధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్‌ సహాయంతో అద్దంకికి చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement