Sunday, May 19, 2024

వైభవంగా చండియాగం…. వేద పండితులతో ప్రత్యేక పూజలు

నిజామాబాద్ సిటీ, ఆగస్టు (ప్రభ న్యూస్)29: నిజామాబాద్ నగర తొలి మేయర్, కాంగ్రేస్ నాయకుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని సంజయ్ స్వగృహంలో చండియాగం వైభవంగా నిర్వహించారు. యాగశాలలో వేద పండితులు మండపా రాధన, గణపతి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో అమ్మవారికి పంచామృతాలు, విశేష ద్రవ్యా లతో అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్బంగా డి.సంజ య్ మాట్లాడుతూ ప్రజా శ్రేయ స్సు కోసం యాగాన్ని నిర్వ హిం చడం గొప్ప అనుభూతి అని, భగవంతుని కృపతో ప్రజలందరికీ విజయాలు సిద్దించాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. యాగం అనంతరం భక్తులకు అన్నధాన కార్యక్రమం నిర్వహిం చారు చండియాగం ముగిసిన వెంటనే వర్షం పడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ ఆకుల చిన్న రాజేశ్వర్, తాహెర్ బిన్ హందన్, నాగేశ్ రెడ్డి, భూపతిరెడ్డి, వినయ్ రెడ్డి, రాజేందర్,ధర్మపురి సురేందర్, భక్తవత్సలం,మాజీ కార్పొ రేటర్లు, కాంగ్రేస్ నాయకులు, నిజామాబాద్ నగర ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement