Saturday, April 27, 2024

NZB: సిమెంట్ లారీ ఢీకొని… ఒకరు మృతి

ఎల్లారెడ్డి, మార్చి26 (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఉదయం సుమారు 8గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివ‌రాలిలా ఉన్నాయి… ఎల్లారెడ్డి వైపు నుండి మహారాష్ట్రకు చెందిన ఏం హెచ్ 12 ఎన్ ఎక్స్ 7521 నెంబర్ గల లారీ సిమెంట్ లోడ్ తో నిజాంసాగర్ వైపు వెళ్తుంది.

అదే వైపు ద్విచక్ర వాహనం పైన అసన్ పల్లి గ్రామానికి చెందిన జి.ప్రశాంత్ (23) పనులు ముగించుకొని నిజాంసాగర్ వైపు వెళ్తున్న సమయంలో డిఎస్పీ కార్యాలయం సమీపంలో సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ వెనక నుండి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న ప్రశాంత్ ను ఢీకొట్టడంతో లారీ టైర్ కింద పడి తల పలికి అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement