Thursday, May 9, 2024

Nizamabad లో కాంగ్రెస్ కు మద్దతుగా టీజేఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)14:రాక్షస పాలను అంతమొందిం చడానికి అన్ని శక్తులు ఏకం కావాలని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.మంగళవారం నిజామాబాద్ నగరంలోని మారుతీ నగర్ లో మాజీమంత్రి షబ్బీర్ అలీ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్ వేసిన జాఫర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలుపు కోసం ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్ ఉపసంహరించు కొని పూర్తి స్థాయిగా మద్దతుని చ్చారు. ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూబంగారు తెలంగాణ గా చేసుకుందామనుకుంటే అప్పుల తెలంగాణ చేసి యువతను తాగుబోతు చేస్తు న్నారనీ విమర్శించారు.రూ5 లక్షల కోట్ల అప్పులు తప్ప తెలంగాణలో కొత్తగా ఒరిగింది ఏమీ లేదనీ మండి పడ్డారు.కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కట్టి కమిషన్ల కక్కుర్తి తో నాసిరకంగా కట్టారు ఈరోజు కూలిపోవడానికి వస్తున్నా యన్నారు.మళ్లీ కేసీఆర్ ను గెలిపిస్తే మన రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అవుతుందన్నారు.అందరు ఏకమై బిఆర్ఎస్ ను గద్దె దించ డానికి కంకణం కట్టుకోవాలనీ పిలుపునిచ్చారు

. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ జాఫర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ తనకు మద్దతుగా ఓట్లు చిలకుండా నామినేషన్ ఉపసంహరిం చుకుని నా గెలుపుకు కృషి చేస్తున్నందుకు రాబోయే కాలంలో వారికి సముచిత న్యాయం చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement