Sunday, April 28, 2024

టెన్త్ లో నిర్మ‌ల్ ఫ‌స్ట్ ప్లేస్‌.. అభినందించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌..

పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఎస్సెస్సీ ఫలితాల్లో ఏకంగా నంబర్ వన్‌గా నిలవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్య శాఖ ఆదికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని, విద్యార్థులను మంత్రి అభినందించారు. ఇదే ఉత్సాహంతో పని చేసి, మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని కొరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement