Monday, April 29, 2024

ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి . నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి

కడెం. సెప్టెంబర్ 3 ప్రభా న్యూస్ కడెం మండలంలోని పెద్దూర్ కడెం ధర్మాజీపేట్ కొండుకూర్ పాండవ పూర్ గ్రామాలలో గల ఓటర్ నమోదు పోలింగ్ కేంద్రాలను ఆదివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కే వరుణ్ రెడ్డి సందర్శించి ఆకస్మిక స్థానిక చేశారు ఈ సందర్భంగా పై కేంద్రాలలో ఓటర్ నమోదు జాబితాలను ఆయన పరిశీలించారు పై కేంద్రాలలో నిర్వహిస్తున్న ఓటర్ నమోదు ప్రక్రియ పై ఆయన ఆరా తీశారు . ఓటరు జాబితాలో లేని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేయాలన్నారు అలాగే గ్రామాలలో ఓటరు నమోదుపై ఓటు హక్కు పై గ్రామ ప్రజలకు బిఎల్ఓ లు అవగాహన కల్పించాలన్నారు

ఈ కార్యక్రమంలో కడెం మండల తహసిల్దార్ యమ్. రాజేశ్వరి డిప్యూటీ మండల తహసిల్దార్ యమ్. చిన్నయ్య కొండుకూరు గ్రామ సర్పంచ్ జి వేణుగోపాల్ ధర్మాజీపేట గ్రామ సర్పంచ్ ఓర్సు వెంకటేష్ స్థానిక బిఎల్ ఓ లు నేరెళ్ల గంగమని పి రాజమణి గొల్ల గంగామణి యమ్. గంగామణి తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement