Saturday, September 21, 2024

రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడవద్దు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంబీర్కూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ( SDF ) నిధుల ద్వారా మంజూరు చేసిన 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. .ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు

రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతలో రాజీ పడకుండా నాణ్యత కూడిన పనులు చేపట్టాలని బ్యాంక్ చైర్మన్ కోరారు. పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు సౌకర్యవంతం చేయాలని నాణ్యత విషయంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ సతీష్,ఎంపీపీ రఘు, రైతు బంధు అధ్యక్షులు ఆవారి గంగారాం,యువజన విభాగం అధ్యక్షుడు శశికాంత్,సొసైటీ చైర్మన్ కొల్లి గాంధీ,ఉప సర్పంచ్ మన్నాన్, లాయాక్, మండల కి ఆప్షన్ ఆరిఫ్,పట్టణ అధ్యక్షుడు రాజు,పట్టణ కార్యదర్శి రఘు,సాహెబ్ రావ్,సలీం నాయకులు, ప్రజా ప్రతినిదులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement