Sunday, May 5, 2024

తుమ్మల ఇంటికి భట్టి….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లి లోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగృహానికి కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం వచ్చి తుమ్మలతో గంట సేపు భేటీ అయ్యారు . తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా తుమ్మలతో భట్టి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది . తుమ్మలను కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించినట్లు భట్టి తెలిపారు . సానుకూలంగా తుమ్మల స్పందిస్తారని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు .

భట్టి వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , మట్టా దయానంద్ , సత్తుపల్లి , అశ్వారావుపేట నుండి పలువురు నాయకులు తుమ్మలను కలిశారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement