Thursday, April 25, 2024

New Record – 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు – మంత్రి గంగుల

దేశంలోనే ఏ రాష్ట్రం సాధించని విధంగా రికార్డ్ స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేటి వరకు కొనుగోలు చేశామని, సీఎం కేసీఆర్ దార్షనికతతో, రైతు సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈరోజు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలను వెల్లడించారు. దాదాపు 10,200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఎనిమిది లక్షల మంది రైతుల నుండి సేకరించామని, ఇందుకోసం రైతు చెంతకే వెళ్లి రికార్డ్ స్థాయిలో 7000 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు, కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1400 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయి మూసివేశామన్నారు.

గత సంవత్సరం ఇదే రోజు కన్నా 12 లక్షల మెట్టనులను అధికంగా సేకరించామన్నారు మంత్రి గంగుల.ఎఫ్ సి ఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల ప్రకారం వచ్చిన దాన్యంలో ఏ మిల్లర్ కోత పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి, ప్రతిపక్షాలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో రాజకీయం చేయొద్దని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement