Sunday, April 28, 2024

TS: రేవంత్ రెడ్డిని క‌లిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు..

ఉమ్మడి మెదక్ బ్యూరో, నవంబర్ 8 (ప్రభ న్యూస్) : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన నీలం మధు పూలబొకే ఇచ్చి శాలువాతో సత్కరించి.. రేవంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ఆత్మగౌరవ పోరాటానికి అండగా నిలబడి ముదిరాజ్ సామాజిక వర్గానికి నాలుగు టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు రుణపడి ఉంటారన్నారు.

నీలం మధును అక్కున చేర్చుకొని పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన అధిష్టానం, రాష్ట్ర పీసీసీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకత్వం, ముఖ్య నాయకులను, అన్నివర్గాల శ్రేణులను కలుపుకుని ఐక్యమత్యంతో పటాన్ చెరులో కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు పటాన్ చెరు సీటును గెలిచి గిఫ్ట్ గా ఇస్తామని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement