Sunday, April 28, 2024

Kadapa: నకిలీ బంగారంతో ఘరానా మోసం.. రూ.3.17కోట్ల బ్యాంకు రుణాలు

ప్రొద్దుటూరు (కడప) ప్రభ న్యూస్ : ఏపీలోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులతో కలిసి ఓ గోల్డ్ అప్రైజర్ ఎస్‌బీఐ బ్యాంకునే బురిడీ కొట్టించాడు. ఖాతాదారులతో కలిసి చంద్రమోహన్ అనే గోల్డ్ అప్రైజర్ ఆభరణాలను తనఖా పెట్టించి రూ.3.17 కోట్ల రుణాలు ఇప్పించాడు.

అయితే రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి బంగారు ఆభరణాలు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అవి నాణ్యతలేని కల్తీ బంగారు ఆభరణాలు అని తేలడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ బీఐ రీజనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement