Sunday, May 5, 2024

TS: నమో అంటే నయా మోసగాడు… మంత్రి కేటీఆర్

నమో అంటే నరేంద్ర మోడీ కాదని.. నయా మోసగాడు అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి 15 లక్షలు వేస్తామని దేశ ప్రజలందరినీ మోడీ మోసగించారన్నారు. 70 రూపాయలన్న పెట్రోలు 110 రూపాయలు చేశారని, 400 ఉన్న సిలిండర్ ను 1200 చేశారన్నారు.

బీఆర్ఎస్ అంటే కాలేశ్వరం అని కాంగ్రెస్ అంటే శనేశ్వరం అని, గోదావరి జలాలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో 90శాతం మంది మూడెకరాల లోపు రైతులు మాత్రమే ఉన్నారని, వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని చెబుతున్నాడన్నారు. రైతాంగం మూడు గంటల కరెంటు చాలు అనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు. ప్రజలందరూ ఆగం కావద్దని ఆలోచించి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలన్నారు. బహిరంగ సభలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement