Saturday, May 4, 2024

Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించింది.

రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఎన్‌సీఎస్ ప్రకారం భూకంపం మూలం నేపాల్‌లో 5 కిలో మీటర్ల లోతులో ఉంది. భూకంపం కారణంగా ఉత్తర భారతదేశంలోని అనేక మంది ప్రజలు ఒక నిమిషం పాటు బలమైన భూప్రకంపనలను అనుభవించారు. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement