Tuesday, April 30, 2024

బీజేపీ చెప్పేవి నీతులు, తవ్వేవి గోతులు.. మునుగోడు ప్రచారంలో మంత్రి పువ్వాడ

కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన నేత సీఎం కేసీఆర్‌ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం కొరటికల్ గ్రామంలో గౌడ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌడ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నేత్వత్వంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని పువ్వాడ అజయ్ అన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. కల్లు దుకాణాలకు లైనెస్స్‌ బకాయిల రద్దు, నీరా పాలసీ, నీరా కేఫ్‌ ఏర్పాటు, వైన్స్ ల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు.

కోకాపేటలో రూ.500 కోట్ల విలువైన భూమిని పాపన్న ట్రస్ట్ కు అప్పగించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంక్షేమానికి పాటుపడుతున్నందున మునుగోడులోని గౌడ్‌లు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement