Wednesday, May 1, 2024

చెరువుగ‌ట్టు ఆల‌యంలో టీఎస్ సీఎస్ ప్ర‌త్యేక పూజ‌లు

మహాశివరాత్రి పండుగ వేడుక‌లు తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఘ‌నంగా చేసుకుంటున్నారు. ఈరోజు శివ‌రాత్రి సంద‌ర్భంగా న‌ల్గొండ‌ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. హైదరాబాద్ నుంచి సోమేష్ కుమార్ చెరువుగట్టు ఆలయానికి చేరుకోగానే.. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఆలయ చైర్మన్ మేకల అరుణ, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ సోమేస్ కుమార్ కుటుంబానికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. సీఎస్‌ కుటుంబసభ్యులతో కలిసి పార్వతిపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనకు జ్ఞాపికను బహుకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement