Friday, May 17, 2024

మెట‌ర్నిటీ , చైల్డ్ కేర్ ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం – ప‌లువురికి గాయాలు

ఓ మెట‌ర్నిటీ అండ్ చైల్డ్ కేర్ హాస్ప‌ట‌ల్ లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో హాస్ప‌ట‌ల్ ఉద్యోగుల‌తో పాటు ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సంఘ‌ట‌న జ‌మ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో చోటు చేసుకుంది. హీటింగ్ గ్యాస్ సిలిండర్‌లో లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని MCCH అధికారి ఒకరు తెలిపారు. ఆసుప‌త్రి ఓ.పీ విభాగంలో ఈ పేలుడు చోటుచేసుకుందన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్టుగా వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement