Monday, May 6, 2024

రైలు ఢీకొని ముగ్గురు మృతి !

నల్లగొండ : రైలు ఢీకొని తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు పిల్లలతో కలిసితో నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. రమ్య (28), ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక (6) మృతిచెందారు. మృతదేహాలను సత్తెనపల్లి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

నడికూడ రైల్వే పోలీసులు నల్లగొండలోని ఆమె భర్త , కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సత్తెనపల్లికి తరలివెళ్లారు. ఈ సంఘటన ప్రమాదమా? ఆత్మహత్య అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement