Monday, April 29, 2024

రేపు దత్తత గ్రామంలో కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. సాగర్ ఉపఎన్నికల సమయంలో త్వరలో తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన బుధవారం వాసాలమర్రిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: చిన్నారికి రూ.16 కోట్ల విలువైన అరుదైన లాటరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement