Friday, May 3, 2024

Protest – ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం అర్ధనగ్న ప్రదర్శన

చౌటుప్పల్, జూలై 19 (ప్రభ న్యూస్) : చౌటుప్పల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని సీఎం కే చంద్రశేఖర్ రావు 2018 ఎన్నికల సందర్భంగా చండూరు సభలో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఎస్ యూఐ నియోజకవర్గం అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చౌటుప్పల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల వేలాది మంది పేద విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో ఫీజులు కట్టి చదవలేక మధ్యలోనే ఆపివేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేదంటే ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రాచకొండ భార్గవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఎస్ యూఐ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement