Sunday, May 5, 2024

మోత్కూర్ ను రెవెన్యూ డివిజన్ చేయాల‌ని కోరుతూ ఆందోళ‌న‌..

మోత్కూర్, ఆగస్టు 14 (ప్రభ న్యూస్)మోత్కూరు మండలాన్ని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఆ సమితి ఆధ్వర్యంలో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మహాత్మజ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెవిన్యూ డివిజన్ లేకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు , విద్యార్థులు, యువకులు, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న రెవిన్యూ కార్యాలయానికి వెళ్లాలంటే త్రీవ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి నల్లగొండలో అంత్యంత వెనుకబడిన మోత్కూరు మండలం అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉందన్నారు. ఈ మండలం అభివృద్ధి నోచుకోవాలంటే రెవిన్యూ డివిజన్ ఏర్పాటు అవసరమన్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మోత్కూర్ లో రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకై ఎంపీ,ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు.

.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్య గిరి, జిల్లా నాయకులు గుండగొని రామచంద్రు, బయ్యనిరాజు, సూదగాని పాండు కారుపోతుల వెంకన్న ,దామరోజు సత్యనారాయణ, ఉయ్యాల అంజయ్య, అవిశెట్టి సుధాకర్, ఎడ్ల శ్రీనివాస్, పట్టూరి అంజయ్య నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.,

Advertisement

తాజా వార్తలు

Advertisement