Monday, May 6, 2024

పోలీసుల తనిఖీలు.. బీజేపీ నేత వాహనంలో రూ.కోటి పట్టివేత

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బీజేపీకి చెందిన రూ.కోటి పట్టుబడ్డాయి. బీజేపీకి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement