Friday, April 26, 2024

మునుగోడులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరులోని 2వ, 3వ వార్డుల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీ(టీ)ఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాల‌ని కోరారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి సీఎం కేసీఆర్‌కే సాధ్య‌మ‌న్నారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గం నేసి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement