Sunday, May 19, 2024

నల్లగొండ జిల్లాలో రైతు అర్ధనగ్న దీక్ష

నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం అమనగల్లులో ముండ్ల గురువయ్య అనే రైతు అర్ధనగ్నంగా దీక్ష చేపట్టాడు. ధాన్యం తరుగు తీయకుండా పూర్తిగా డబ్బులు ఇప్పించాలని తన ఇంటివద్ద అర్ధనగ్న దీక్షకు దిగాడు. ధాన్యం తరుగు తీశారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తరుగుపై ప్రశ్నించినందుకు ధాన్యం మొత్తం వాపసు చేస్తామని అధికారులు బెదిరింపులకు పాల్పడటంతో రైతు ఈ విధంగా దీక్షకు దిగాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement