Friday, May 3, 2024

న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని చర్లపల్లిలో రైతుల ధ‌ర్నా

నడికుడ, ఏప్రిల్ 24, ప్రభన్యూస్ : నడికడ మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం రైతు వడ్ల కొనుగోలు కేంద్రాలకు బీఆర్ఎస్ నాయకులు రావడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత సంవత్సరం నష్టపోయిన పంట నష్టాన్ని చెక్కుల రూపంలో గ్రామస్తులకు అందజేయడంలో రెవెన్యూ అధికారులు విఫలమైనారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వీఆర్ఏ బిక్షపతి, అనధికార వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి సర్వే చేసి తనకు సంబంధించిన వారికే చెక్కులు ఇవ్వడం జరిగిందని గొడవ పెట్టుకున్నారు. గ్రామస్తులు వీఆర్ఏ ను ప్రశ్నించడంతో అక్కడి నుండి జంప్ ఆయన సంఘటన చెర్లపల్లిలో జరిగింది. దీనిపై అధికారులు స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. రైతులు నష్టపరిహారం చెల్లించాలని రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement