Friday, May 17, 2024

TS | పాత ఇనుప షాప్ లో పేలిన సిలిండ‌ర్‌.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

మోత్కూర్, (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లాలో పాత ఇనుప దుకాణంలో ఆటో గ్యాస్ సిలిండర్ పేలింది. కటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘటన మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా గురువారం సాయంత్రం జ‌రిగింది.

మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజార్ లో 20 ఏండ్లుగా ఖళీమొద్దీన్ పాత ఇనుప దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల గ్యాస్ ఆటో కు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయగా, ఆ సిలిండర్ ను స్థానికుడైన పోలోజు సోమలింగా చారి తో కటింగ్ చేసి ఇనుమును అమ్మేందుకు యత్నిస్తుండగా సిలిండర్ లో గ్యాస్ ఫైర్ అయ్యింది.

దీంతో మంటలు చెల‌రేగి సోమలింగా చారి తలకు, మొఖానికి, చేతులకు గాయాల‌య్యాయి. సిలిండర్ ను పట్టుకున్న ఎండి లతీఫ్ కు మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స నిర్వహించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement