Thursday, May 2, 2024

గుండా రాజకీయానికి తెరదించుతా…మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ – .పదవుల కోసం ఎమ్మెల్సీ పార్టీ మారుతూ కాంగ్రెస్ పార్టీకి నష్టం తెస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీకూచుకుల్ల దామోదర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా కొనసాగుతూ కొడుకు కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. 1995 2004లో తన స్వార్థం కోసం ఇతర పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసే కాంగ్రెస్ పార్టీకి నష్టపరిచారని వెల్లడించారు. ఈ విషయం డిసిసి అధ్యక్షులు తెలియదా అని ప్రశ్నించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement