Thursday, May 2, 2024

TS | టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి.. రైతు బంధు చైర్మన్‌గా రాజయ్య!

బీఆర్ ఎస్ పార్టీలోని ముఖ్య నాయ‌కుల‌కు సీఎం కేసీఆర్ కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టారు. వీరిలో జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిని టీఎస్ ఆర్టీసీ చైర్మ‌న్‌గా నియ‌మించారు. అదేవిధంగా తెలంగాణ రైతుబంధు చైర్మ‌న్‌గా తాటికొండ రాజ‌య్య‌ను నియ‌మించారు.

ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇవ్వాల (గురువారం) రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక‌.. రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా నియమితులయ్యారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement