Tuesday, April 30, 2024

రోడ్డు పనులను పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్మెన్‌ కొండల్‌రెడ్డి..

ఘట్‌కేసర్‌, (ప్రభన్యూస్‌) : పోచారంలోని బాబానగర్‌ కాలనీ, హరివిల్లు హోమ్స్‌లో సాధారణ నిధులు రూ. 9 లక్షల 50వేలతో నిర్మిస్తున్న సీసీరోడ్డు, హరివిల్లుహోమ్స్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ. 16 లక్షలతో నిర్మిస్తున్న బిటిరోడ్డు నిర్మాణపు పనులను చైర్మెన్‌ కొండల్‌రెడ్డి పరిశీలించారు. కాంట్రాక్టరు రోడ్ల నిర్మాణపు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని చైర్మెన్‌ కొండల్‌రెడ్డి సూచించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్‌ అబ్బవతిని సరిత స్వామి, ఏఈ నరేష్‌, నాయకులు అబ్బవతిని నర్సింహ్మ, డాక్టర్‌ లక్ష్మణ్‌, సురేష్‌, వెంకటేష్‌, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement