Wednesday, May 8, 2024

Khammam: తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్ డివి

మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరావు సమక్షంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పలువురు వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ‌ దమ్మలపాటి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుమ్మల పాల్గొని వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మంచి కోసం జరుగుతున్న ఈ సంఘ గ్రామంలో మనమంతా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

అధికార పార్టీ అరాచకత్వం, నియంత్రత్వం నుండి ఈ జిల్లా ప్రజలను విముక్తి చేయడానికి, కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో పదవి ఉన్నా లేకపోయినా అనుక్షణం జిల్లా అభివృద్ధి కోసం పని చేశానని ప్రత్యేకంగా ఇల్లందు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని అన్నారు. మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు సారధ్యంలో ఇల్లందు మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి, ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి కోరం కనకయ్య, సీనియర్ నాయకులు కనగాల పేరయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ఎస్ కే జానీ మాజీ మున్సిపల్ చైర్మన్ అనసూర్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి సైదులు, చేరిన వార్డు కౌన్సిలర్లు నవీన్ వార రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement