కరీంనగర్ – పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. . శనివారం కొండగట్టుకు వెళ్తుండగా మార్గమధ్యంలో కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ తో కలసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. కీసర గుట్ట వలె కొండగట్టులో ఎనిమిది వందల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ సిపి సుబ్బారాయుడు, నగర మేయర్ సునీల్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.