Sunday, May 5, 2024

TS : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ ప‌సునూరి…

బీఆర్ఎస్ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ దయాకర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా.. పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న దయాకర్.. 2015 వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి ఎంపీ సీటు తనకు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. సిటింగ్‌ ఎంపీనైన తనకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధ కలిగించిందని అందుకే తాను పార్టీ మారుతున్నట్లు చెప్పారు పసునూరి దయాకర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement